శ్రీరామనవమికి తెలంగాణకు అమిత్​షా?

by Disha Web Desk 4 |
శ్రీరామనవమికి తెలంగాణకు అమిత్​షా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అందులో భాగంగానే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్​షా తెలంగాణకు విచ్చేయనున్నారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన తెలంగాణకు వచ్చే అవకాశాలున్నాయని విశ్వసనీయ సమాచారం. రామనవమి సందర్భంగా ఏప్రిల్​10వ తేదీన భద్రాచలం సీతారాముల కల్యాణానికి అమిత్​షా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నట్లు సమాచారం. అనంతరం పాత‌బ‌స్తీలోని భాగ్యల‌క్ష్మీ అమ్మవారి ఆల‌యాన్ని కూడా సంద‌ర్శించుకునే అవకాశాలున్నాయి. అదేరోజు హైదరాబాద్​లో పలువురు మేధావులతో భేటీ అవుతారని సమాచారం. బీజేపీలో చేరే కీలక నేతలతో సైతం చర్చలు జరిపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏప్రిల్​14వ తేదీన గద్వాల జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టనన్న రెండో విడుత ప్రజా ప్రస్థాన యాత్ర ప్రారంభోత్సవానికి సైతం అమిత్​షా హాజరుకానున్నారు. గతంలో అమిత్​షా రెండుమార్లు తెలంగాణలో పర్యటనలు చేస్తానని స్పష్టం చేశారు. ఒకే నెలలో రెండు పర్యటనలు ఉండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story

Most Viewed