- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NZB: పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా
నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని(Turmeric Board office) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రారంభించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని(Turmeric Board office) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రారంభించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ధర్మపురి అర్వింద్ సహా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పసుపు ఉత్పత్తులను అమిత్ షా పరిశీలించారు. అంతకుముందు హైదరాబాదులోని బేగంపేట నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్కు బయలుదేరిన అమిత్ షా.. కలెక్టరేట్ గ్రౌండ్కు చేరుకుని అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా పసుపు బోర్డు కేంద్ర కార్యాలయం వరకు చేరుకున్నారు. అనంతరం ఆయన పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్ షా ఎక్కడ ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. బోర్డు కార్యాలయంలో ఏర్పాటుచేసిన పసుపు సంబంధిత ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్త, జాతీయ పసుపు బోర్డు కేంద్ర కార్యాలయ అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.






