అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆయన మనవడు

by Disha Web Desk 4 |
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన ఆయన మనవడు
X

దిశ, హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి ఆయన మనవడు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో వచ్చిన ఆయన ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాల మైదానంలో దిగి.. రోడ్డు మార్గం ద్వారా చౌరస్తాకు చేరుకున్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి, ఎస్ సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆర్‌వి కర్ణన్‌తో కలిసి ఆయన అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకమైన దళితబంధు యూనిట్లను పరిశీలించేందుకు జమ్మికుంటకు వెళ్లారు. ఆయన రాక సందర్బంగా కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. అంబేద్కర్ 132 వ జయంతి నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ప్రకాష్ యశ్వంత్ అంబేద్కర్‌కు ఘనస్వాగతం పలికారు.


Next Story

Most Viewed