టికెట్ల కేటాయింపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
టికెట్ల కేటాయింపు.. ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: టికెట్ల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ ఎంపీ, మాజీ పీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టికెట్ వస్తేనే పని చేస్తామడం సరికాదని ఆశావాహులంతా ప్రజల్లో తిరగాలని అన్నారు. తెలంగాణలో బీజేపీ పోటీనేలే లేదని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటడం ఖాయం అన్నారు. కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

ఇవాళ గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్టోబర్ 6న అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజావ్యతిరేకత ఉందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు నియంతలా, సామంత రాజుల్లా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Next Story