అలర్ట్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్.. ఎప్పటివరకంటే?

by Disha Web Desk 4 |
అలర్ట్ : దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై రాకపోకలు బంద్.. ఎప్పటివరకంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: దుర్గం చెరువుపై రాకపోకలు సాగించే వాహనదారులకు అలర్ట్.. ఈరోజు (ఏప్రిల్) నుంచి మూడు రోజుల పాటు ఈ వంతెనను మూసివేయనున్నారు. కేబుల్ బ్రిడ్జి నిర్వహణలో భాగంగా ఇంజనీర్లతో తనిఖీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు. భారీ వాహనాలు, యంత్రాలు కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి రావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుందని కమిషనర్ తెలిపారు. బ్రిడ్జి తనిఖీల కోసం భారీ బరువు ఉన్న క్రేన్లు, వాహనాలు, యంత్రాలు, పరికరాలను కేబుల్ బ్రిడ్జిపై ఉంచాల్సి వస్తుందని తెలిపారు.

అందుకే మూడు రోజుల పాటు కేబుల్ బ్రిడ్జిని మూసివేయనున్నట్లు తెలిపారు. మూడు రోజులు పాదాచారులు, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల గుండా వెళ్లాలని ఆయన సూచించారు. రోడ్ నంబర్ 45 నుంచి కేబుల్ బ్రిడ్జి మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనాలను రెండు మార్గాల్లో మళ్లిస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఐకియా వైపు వెళ్లే వాహనదారులు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మీదుగా వెళ్లాలని సూచించారు. అలాగే ఐకియా నుంచి జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు ఇన్ ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, మాదాపూర్ నుంచి డైవర్షన్ తీసుకోవాలని పోలీసులు కోరారు.

Next Story

Most Viewed