- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు అలర్ట్.. ఓయూ, జేఎన్టీయూ పరిధిలో పరీక్షలు వాయిదా!
రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్ పిలుపు నేపథ్యంలో ఈ నెల 24న జరగాల్సిన ఉస్మానియా (ఓయూ), జేఎన్టీయూ, టీయూ పరిధిలోని అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఇచ్చిన విద్యాసంస్థల బంద్ పిలుపు నేపథ్యంలో ఈ నెల 24న జరగాల్సిన ఉస్మానియా (ఓయూ), జేఎన్టీయూ, టీయూ పరిధిలోని అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆయా వర్సిటీల అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారు.
పరీక్షల వాయిదా
జులై 24న ఓయూ, జేఎన్టీయూ వాటి అనుబంధ కళాశాలల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. వాయిదా పడిన పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.
బంద్కు కారణం
నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో వైఫల్యం, పేపర్ లీకేజీలు, విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ను నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, ఎన్ఎస్యూఐ, పీడీఎస్యూ తదితర విద్యార్థి సంఘాలు ఈ బంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. వరుస పేపర్ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక డిమాండ్ చేస్తోంది. అలాగే, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని రద్దు చేయాలని, వీబీఎస్ఏ బిల్లును వెనక్కి తీసుకోవాలని వారు పట్టుబడుతున్నారు. బంద్ కారణంగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతోనే వర్సిటీలు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.






