గాడిదపై ఎక్కి ఎంపీ అవ్వాల్సిందేనా ఆర్ఎస్పీ? పొత్తుపై రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 14 |
గాడిదపై ఎక్కి ఎంపీ అవ్వాల్సిందేనా ఆర్ఎస్పీ? పొత్తుపై రిటైర్డ్ ఐఏఎస్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కలిసి పోటీ చేయబోతున్నట్లు బీఆర్ఎస్, బీఎస్పీ అధినేతలు కేసీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీల పొత్తులపై రిటైర్డ్ ఐఏఎస్, సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్ ఆకునూరి మురళి ఎక్స్ ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు.

‘ఎలా రెస్పాండ్ అవ్వాలో అర్థం కావడం లేదు ఆర్ఎస్పీ గారు. గత రెండు ఏళ్లు మీరు బీఆర్ఎస్ మీద చెప్పినవన్నీ తప్పులు అయినట్టేనా? అప్పుడు దుర్మార్గుడిగా కనపడిన కేసీఆర్ ఇప్పుడు హీరో అయ్యిండా ? గాడిద మీద ఎక్కి అయినా పర్లేదు మీరు ఎంపీ అవ్వాల్సిందేనా ? ( ఐ అపాలజైస్ డాంకీ). రేపు బీఆర్ఎస్ కేంద్రంలో ఎవరికి సపోర్ట్ చేస్తుందో మీకు తెలియదా? రాజ్యాంగాన్ని ఎవరు రద్దు చేస్తారో మీకు తెలియదా ? రాజకీయాల్లో విలువలు ఉండవనే వాదనను మీరు కూడా అనుసరిస్తారా ? అన్యాయం పోలీస్ బాస్.. కరెక్ట్ కాదు మీ స్టెప్. యువత ఇంకా ఎవ్వరిని నమ్మరు, మిమ్మల్ని మీ రాజకీయాల్ని చూసాక. సారీ.. మిస్టర్ ఆర్ఎస్పీ బీఎస్పీ.’ అంటూ ట్వీట్ చేశారు.



Next Story