T Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్.. డీసీసీల ఎంపిక కోసం కీలక నిర్ణయం

by Prasad Jukanti |   (  Updated:2025-09-23 13:29:03  IST  )

డీసీసీ అధ్యక్షుల నియామకం విషయంలో కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది.

T Congress: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు గుడ్ న్యూస్.. డీసీసీల ఎంపిక కోసం కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో: చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఊరిస్తున్న పదవుల పండగకు రంగం సిద్ధమవుతోంది. డీసీసీ అధ్యక్షుల ఎంపిక కోసం ఏఐసీసీ పరిశీలకులను అధిష్టానం నియమించింది. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుల ఎంపిక కోసం పరిశీలకుల పేర్లను ఏఐసీసీ మంగళవారం ప్రకటించింది. తెలంగాణ కోసం 22 మందిని ఏఐసీసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే నియమించినట్లు ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ఏఐసీసీ నియమించిన పరిశీలకులు వీరే:

1. వి.నారాయణస్వామి

2. సి.పి.జోషి

3. శక్తి సింగ్ గోహిల్

4. బెన్నీ బెహానన్

5. అంటో ఆంటోనీ

6. హిబి ఈడెన్

7. స్జారిటా లైట్‌ఫ్లాంగ్

8. శోభా ఓజా

9. బి.వి. శ్రీనివాస్

10. అజయ్ సింగ్

11. రిజ్వాన్ అర్షద్

12. టి.సిద్ధిక్

13. సోఫియా ఫిర్దాస్

14. శ్రీనివాస్ మానే

15. అమిన్ పటేల్

16. ఎం.నారాయణ స్వామి

17. సారత్ రౌత్

18. బిస్వరంజన్ మోహంతీ

19. నబజ్యోతి పట్నాయక్

20. డెబాసిస్ పట్నాయక్

21. జాన్సన్ అబ్రహామ్

22. కె.మహేంద్రన్

Next Story