ముందుచూపుతో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం.. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి

by Dishafeatures2 |
Minister Niranjan Reddy
X

దిశ , తెలంగాణ బ్యూరో: దేశంలో వంట నూనెల ఉత్పత్తి డిమాండ్ అధికంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో ముందుచూపుతో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అందించేందుకు చర్యలు చేపట్టిందనీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. శనివారం శాసనసభలో సభ్యులు సండ్ర వెంకటవీరయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వొడితెల సతీష్ కుమార్ లు రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం – తీసుకుంటున్న చర్యలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ..దేశంలో తలసరి వంటనూనెల వినియోగం సాలీనా 19 కిలోలు ఉందని అన్నారు. దేశంలో 250 లక్షల మెట్రిక్ టన్నుల వంటనూనెల వినియోగం అవుతుండగా.. దేశంలో ఉత్పత్తి అవుతున్న వంటనూనెలు 130 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే వుందని చెప్పారు.ఇక మిగిలిన వంటనూనెలు అన్నీ విదేశాల నుండి దిగుమతి అవుతున్నవనీ తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి కేవలం 40 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు.. ఏడాదిలో లక్ష 18 వేల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు .. నూతనంగా 2023 – 24లో 2.30 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యం .. దీని కోసం రూ.750 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఎకరాకు రూ.50,918 చొప్పున సబ్సిడీ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతుకు ప్లాంట్ మెటీరియల్, ఇంటర్ క్రాప్ – ఇన్ ఫుట్స్, బిందు సేద్యం కోసం అందించడం జరుగుతున్నది మంత్రి వివరించారు.

వంటనూనెల్లో స్వయంపోషకం కావాలంటే దేశంలో 70 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేయాల్సి ఉందన్నారు.అందుకే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశనంలో 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు.రాష్ట్రంలో 38 ఆయిల్ పామ్ నర్సరీలు ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పలు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకు నిర్మల్, వనపర్తి, మంచిర్యాలలో భూమి కేటాయింపు చేశామన్నరు. సాగుకు ముందుకువచ్చిన వారికి ఆయా జిల్లాలలో భూములు ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. ఒక రైతుకు 12.5 ఎకరాల వరకే సబ్సిడీ ఇచ్చేందుకు కేంద్రం పరిమితి విధించిందనీ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఆ పరిమితి సవరించేందుకు ప్రయత్నిస్తామన్నరు.పూర్వపు ఖమ్మం జిల్లా కల్లూరుగూడెం వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ, రిఫైనరీ పనులు కొనసాగుతున్నాయనీ అన్నారు. ఆయిల్ ఎక్స్ ట్రాక్షన్ ( ఓ ఈ ఆర్ ) ఆధారంగా ఆయిల్ పామ్ ధర నిర్ణయించడం మూలంగా పామాయిల్ గెలలకు టన్నుకు రూ.17 వేల పై చిలుకు ధర పలుకుతున్నదనీ మంత్రి వివరించారు.


Next Story

Most Viewed