- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YSR Awards: వైఎస్ఆర్ పేరుతో వ్యవసాయ అవార్డులు.. డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుగా అభ్యుదయ రైతులకు (YSR Awards) అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. అందులో భాగంగా వైఎస్ఆర్ పేరు మీద ఒక ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి దాని ద్వారా కార్యక్రమాలను నిర్వహించాలనే ఆలోచన చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా బంజారాహిల్స్ వద్ద కాంగ్రెస్ నేతలు విగ్రహానికి పూలమాలలువేసి నివాళులు అర్పించారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
వచ్చే వర్ధంతి కల్లా ఒక కార్యక్రమాన్ని రూపకల్పన చేసి వ్యవసాయ రంగంలో నిష్ణాతులైన వారిని, వ్యవసాయంపై రీసెర్చ్ చేస్తున్న వారిని, ఈ ప్రాంత అభివృద్ధికి వ్యవసాయ రంగానికి దోహదపడుతున్న వారిని గుర్తించి వైఎస్ఆర్ పేరుమీద అవార్డులు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్ ను నిత్యం స్మరిస్తూ.. వారి ఆలోచనను ముందుకు తీసుకువెళతామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైఎస్ఆర్ అంటే మొదట గుర్తుకువచ్చేది వ్యవసాయం.. ప్రాజెక్టులేనని ఉప ముఖ్యమంత్రి చెప్పారు.
రెండు జీవనదుల్లో ప్రవహిస్తున్న నీటిని ప్రాజెక్టులు కట్టి నీటిని పంట పొలాలకు పారించిన ఆలోచన వైఎస్ఆర్ ది అని కొనియాడారు. వైఎస్ఆర్ భౌతికంగా లేనిలోటును ఎవ్వరూ రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రజలకు తీర్చలేరని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.






