శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి: టీఎస్ యూటీఎఫ్

by Disha Web Desk 19 |
శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించాలి: టీఎస్ యూటీఎఫ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యారంగంలో శ్రమదోపిడీ ఎక్కువైందని, మేడే స్ఫూర్తితో శ్రమదోపిడీ అంతానికి ఉద్యమించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె జంగయ్య, చావ రవి పిలుపునిచ్చారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో మేడే దినోత్సవం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యారంగంలో ఖాళీలను భర్తీ చేయకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, గెస్ట్, పార్ట్ టైం పేరుతో ఉపాధ్యాయులను నియమించి అతి తక్కువ వేతనాలు ఇచ్చి పూర్తి స్థాయిలో పనిచేయించుకుంటూ ప్రభుత్వమే శ్రమదోపిడీకి పాల్పడుతుందని విమర్శించారు.

పాలకులు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి పని గంటలు పెంచేసి, సమాన వేతనాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. ఉపాధ్యాయులు కూడా శ్రామిక వర్గ ఆలోచనను అలవర్చుకోవాలని, విద్యారంగంలో శ్రమదోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు డి మస్తాన్ రావు, పత్రిక ప్రధాన సంపాదకుడు పి మాణిక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు గాలయ్య, సింహాచలం, నాయకులు శారద, వెంకటప్ప, గోపాల్ నాయక్, రాజారావు, శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed