YSRTP నియోజకవర్గ కార్యకర్తల సమావేశం

by Dishanational2 |
YSRTP నియోజకవర్గ కార్యకర్తల సమావేశం
X

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని డీసెంట్ ఫంక్షన్ హాల్‌లో బుధువారం వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ ముధోల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి అదిలాబాద్ జిల్లా పార్టీ కో ఆర్డినేటర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ముఖ్యఅతిథిగా అనిల్ కుమార్‌కి కండువా వేసి, పులామాల‌తో సత్కరించారు. తాలూకా లోని పలువురు కార్యకర్తలు పార్టీలో చేరగా వారికీ పార్టీ నాయకులు కండువా వేసి,పార్టీ లోకి ఆహ్వానించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ.. సంక్షేమం, సమానత్వం, స్వయంసమృద్ధి అనే నినాదం‌తో రాష్ట్ర ప్రజలకు పార్టీ మరింత చేరువ అవుతుందన్నారు. ప్రభుత్వ తప్పిదాలను అనుక్షణం ఎండగడుతూ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో ముధోల్ నియోజకవర్గ ఇన్చార్జి బెజ్ఙంకి ముత్యంరెడ్డి, నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ లక్ష్మారెడ్డి తాలూకా పార్టీ మండలాల నాయకులు, తదితరులు హాజరయ్యారు.


Next Story

Most Viewed