దుర్గామాతకు బోనం సమర్పించిన మహిళలు

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-09-30 12:01:32  IST  )

దుర్గామాతకు బోనం సమర్పించిన మహిళలు
X

దిశ, మామడ : మండ‌లంలోని పొన్క‌ల్, ఆద‌ర్శ్ న‌గ‌ర్ గ్రామాల్లో ప్రతిష్టించిన దుర్గామాత కు మంగళవారం భక్తులు బోనాలు సమర్పించారు.ఈ సందర్భంగా బోనాలను నెత్తి పైన పెట్టుకొని గ్రామంలో ప్రధాన వీధుల వెంబడి ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేకంగా తయారు చేసిన బోనాలను దుర్గామాతకు నైవేద్యంగా సమర్పించారు. అలాగే అమ్మ‌వారికి ప్రత్యేక పూజలు చేశారు. తమ కుటుంబాలను చల్లంగా చూడాలని దుర్గామాతను వేడుకున్నారు .ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు, నాయకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.

Next Story