అడవి పంది దాడిలో గాయపడ్డ మహిళ

by Nallavelli.Anjaneyulu |

అడ‌వి పంది దాడిలో మ‌హిళా గాయ‌ప‌డిన ఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది.

అడవి పంది దాడిలో గాయపడ్డ మహిళ
X

దిశ, నేరడిగొండ : అడ‌వి పంది దాడిలో మ‌హిళా గాయ‌ప‌డిన ఘ‌ట‌న మండ‌ల కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. మండ‌ల కేంద్రంలో పోల్కం ల‌క్ష్మీ(60) మ‌ల‌, మూత్రాల కోసం ఊరు ప‌క్క‌నే ఉన్న పొద‌ల వైపు వెళ్తూ ఉండ‌గా.. అడ‌వి పందులు దాడి చేశాయి. మేక‌ల కాప‌రి ద‌గ్గ‌రికీ వెళ్లి చూసి త‌న కుమారుడు పోల్కం న‌వీన్ కు స‌మాచారం అందించాడు. వెంట‌నే ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి అంబులెన్స్ ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ఆసుప‌త్రిలో చికిత్స పొందుతుంది. అధికారులు త‌మను ఆదుకోవాల‌ని కుమారుడు కోరుతున్నాడు.

Next Story