ఎంఐఎంను గెలిచిన చోట్లల్ల గొడవలు, అత్యాచారాలే..!

by Ratna Kumari |

దేశంలో, రాష్ట్రంలో ఎంఐఎం గెలిచిన చోట్లల్ల గొడవలు,అత్యాచారాలు అవుతున్నాయని, భైంసా క్షేత్రం ఈ మున్సిపల్ పోల్లో కాషాయం అవాలని మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రానా కౌర్ అన్నారు.

ఎంఐఎంను గెలిచిన చోట్లల్ల గొడవలు, అత్యాచారాలే..!
X

దిశ, బైంసా : దేశంలో, రాష్ట్రంలో ఎంఐఎం గెలిచిన చోట్లల్ల గొడవలు,అత్యాచారాలు అవుతున్నాయని, భైంసా క్షేత్రం ఈ మున్సిపల్ పోల్లో కాషాయం అవ్వాల‌ని మహారాష్ట్ర బీజేపీ మాజీ ఎంపీ నవనీత్ రానా కౌర్ అన్నారు. బాసర అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని.. ఆదివారం పట్టణంలోని ఎమ్మెల్యే రామారావు పటేల్ నివాసంలో కార్యకర్తలను కలవడానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. పట్టణ పీఠం నాలుగుసార్లు ఎంఐఎం అధిష్టించిందని, ఈ సారి బొట్టు పెట్టిన హిందువులందరూ భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని అన్నారు. మన దేశ, మన రాష్ట్ర, మన స్వస్థలం బాగుండాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలన్నారు. హిందువులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ పర్సంటేజ్ ను పెంచాలన్నారు. ఇప్పటికే ఓవైసీ పలుచోట్ల బుర్కా వాలే ప్రధాని హోనా అంటూ ప్రచారాలు మొదలు పెడుతున్నారన్నారు.

Next Story