సీసీఐ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం

by Taduka Kalyani |

ఆగస్టు 31లోగా ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న హెచ్చరించారు.

సీసీఐ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం
X

దిశ,ఆదిలాబాద్ : ఆగస్టు 31లోగా ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న హెచ్చరించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు..సీసీఐ పునఃప్రారంభంపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని, స్థానిక బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా చొరవ చూపడం లేదని విమర్శించారు. ఆగస్టు నెలాఖరులోగా నిర్ణయం వెలువడకపోతే సీసీఐ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు.

Next Story