తీరనున్న మూడు మండలాల కష్టాలు..

by Disha Web Desk 20 |
తీరనున్న మూడు మండలాల కష్టాలు..
X

దిశ, బెజ్జుర్ : తీగల ఒర్రె వంతెనకు నిధులు మంజూరు కావడంతో పెంచికలపేట, బెజ్జూరు, చింతలమానెపల్లి మండలాల ప్రజల కష్టాలు తీరనున్నాయని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. మంగళవారం బెజ్జూర్ మండలం సులుగుపెళ్లి సమీపంలో తీగల ఒరె వంతెనకు సిర్పూర్ ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీగల ఒర్రెకు ప్రభుత్వం ఎల్ డబ్ల్యూ ఎస్ కింద రు.2.53. కోట్లు, నాగుల ఒర్రె కు రు.2.58 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఈ నిధుల మంజూరుతో మూడు మండలాల కష్టాలు కలిగిన తొలిగిపోయాయని తెలిపారు. వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న మండలాల ప్రజలకు కష్టాలు తీరునున్నాయి.

తునికాకు రాయల్టీ సిర్పూర్ నియోజకవర్గానికి రూ.12 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. 2018-21 సంవత్సరానికి గాను ఈ నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈనెల 27 నుంచి గ్రామాల్లో తునికాకు రాయల్టీ పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వచ్చే నెల10 లోపు గిరిజనులకు పోడు భూములు పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పుష్పలత, పీఏసీఎస్ చైర్మన్ ఓం ప్రకాష్, మండల కో ఆప్షన్ సభ్యులు బషరత్ ఖాన్, సర్పంచులు హనుమంతు, తిరుపతి, ఎంపీటీసీలు శ్రీనివాస్, గురజాల వెంకన్న, టీఆర్ఎస్ అధ్యక్షులు సకరం నాయకులు వర్ష శంకర్, పుల్లూరి సతీష్, జాహిద్ హుస్సేన్, రవీందర్ గౌడ్, నరేందర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed