వేలాల జాత‌రలో విషాదం.. గుండెపోటుతో వ్య‌క్తి మృతి

by Ratna Kumari |

వేలాల జాతరలో గుండెపోటు తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటు చేసుకుంది.

వేలాల జాత‌రలో విషాదం.. గుండెపోటుతో వ్య‌క్తి మృతి
X

దిశ‌, మంచిర్యాల : వేలాల జాతరలో గుండెపోటు తో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో చోటు చేసుకుంది. మహా శివరాత్రి పర్వదిన సందర్భంగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గట్టు మల్లన్న జాతరలో నస్పూర్ కాలనీకి చెందిన బింగి రాజేందర్ 45 సంవత్సరాల అనే వ్యక్తి గట్టు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి గుట్ట పైకి ఎక్కుతుండగా.. హార్ట్ స్ట్రోక్ రావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు సమాచారం అందించడంతో కుటుంబీకులు మృతదేహం వద్ద కన్నీరు మున్నీ రుగా విలపించారు. గట్టు మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి వచ్చి మృతి చెందడంతో కుటుంబీకులు బోరున విలపించారు. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

Next Story