సాయిరాం మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : కుటుంబ సభ్యుల ధర్నా

by Batti.Sumithra |

దిమ్మదుర్తి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిరాం చనిపోలేదని, వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

సాయిరాం మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి : కుటుంబ సభ్యుల ధర్నా
X

దిశ, మామడ : మండలంలోని దిమ్మదుర్తి గ్రామ సమీపంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిరాం చనిపోలేదని, వాహనంతో ఢీ కొట్టి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రహదారి పై ధర్నా చేశారు. ఈ సంఘటన స్థలాన్ని సోన్ సీఐ గోవర్ధన్ రెడ్డి, ఎస్సైలు, పోలీసులు చేరుకుని బాధితులతో మాట్లాడి, దీనికి కారకులైన వారిని పట్టుకొని శిక్షిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Next Story