బైక్‌పై వచ్చి మూడు తులాల పుస్తెలతాడు చోరీ

by Batti.Sumithra |

పట్టణంలోని బీట్ బజార్‌లో వాసవి మాత ఆలయం సమీపంలో ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది.

బైక్‌పై వచ్చి మూడు తులాల పుస్తెలతాడు చోరీ
X

దిశ, లక్షెట్టిపేట : పట్టణంలోని బీట్ బజార్‌లో వాసవి మాత ఆలయం సమీపంలో ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. ఎస్సై గోపతి సురేష్ తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు కొండ సరోజన ఉదయం 7 గంటల సమయంలో గుడికి వెళ్లేందుకు ఇంటి ముందు చెట్టుకు ఉన్న పూలు తెంపుతుండగా, గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో ఉన్న పుస్తెలతాడును లాక్కొని పరారయ్యాడు. దొంగిలించిన పుస్తెలతాడు సుమారు మూడు తులాల వరకు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన పై ఎస్సై గోపతి సురేష్ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.

Next Story