ఇవాళ్టి నుంచి భారత్-అఫ్గాన్ మ‌ధ్య‌ ఏకైక టెస్ట్

by velandi.Saikiran |

ఇవాళ్టి నుంచి భారత్-అఫ్గాన్ మ‌ధ్య‌ ఏకైక టెస్ట్ ప్రారంభం కానుంది.

ఇవాళ్టి నుంచి భారత్-అఫ్గాన్ మ‌ధ్య‌ ఏకైక టెస్ట్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నేటి నుంచి ఏకైక టెస్ట్ జరగనుంది. ముల్లాన్ పూర్ వేదికగా ఈ టెస్ట్ ప్రారంభం అవుతుంది. రెండు నెలల పాటు ఐపీఎల్ తో బిజీగా ఉన్న భారత క్రికెటర్లు.. ఇప్పుడు ఒక్కసారిగా టెస్ట్ ఫార్మాట్ లో వినోదం అందించేందుకు సిద్ధమయ్యారు. గిల్ సారధ్యంలోని భారత జట్టు, ఆఫ్ఘనిస్తాన్ తో తలపడనుంది. ఈ టెస్ట్ ఇండియాలో జరుగుతుండడం, దానికి తోడు ప్రత్యర్థి పసికూన ఆఫ్ఘనిస్తాన్ అయిన నేపథ్యంలో టెస్ట్ మ్యాచ్ ఏక పక్షంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల్లో మ్యాచ్ ఫినిష్ అవుతుందని కూడా అంచనా వేస్తున్నారు. కాగా ఈ రెండు జట్ల మధ్య ఇవాళ ఉదయం 9:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

ఇరు జ‌ట్ల అంచ‌నా

ఇండియా : కెఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్‌), రిషబ్ పంత్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్టన్ సుందర్, నితీష్ రెడ్డి, హర్ష్ దూబే / మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆఫ్ఘనిస్తాన్ : అబ్దుల్ మాలిక్, రహ్మానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), సెడిఖుల్లా అటల్, అఫ్సర్ జజాయ్ (WK), అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, జియా షరీఫీ, నంగేయాలియా

Next Story