ఆర్టీసీ డ్రైవర్ ను చెప్పుతో కొట్టిన మహిళ

by Disha Web Desk 1 |
ఆర్టీసీ డ్రైవర్ ను చెప్పుతో కొట్టిన మహిళ
X

దిశ, బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ వద్ద ఆర్టీసి డ్రైవర్ ను ఓ మహిళ చెప్పుతో కొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శుక్రవారం రాత్రి రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిలో ఓ మహిళ భర్తతో కలిసి బైక్ పై వెళ్తున్నారు. వారి బైక్ ను ఓవర్ టేక్ చేస్తూ ఆర్టీసీ డ్రైవర్ ముందుకు వెళ్లాడు. దీంతో బైక్ పై వెళ్తున్న దంపతులు ఆర్టీసీ బస్సు ముందు బైక్ ను ఆపారు. వెంటనే మహిళ వెళ్లి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది. దీంతో సహనం కోల్పోయిన సదరు మహిళ డ్రైవర్ ను డ్రైవర్ ను చెప్పుతో కొట్టింది. అనంతరం స్థానికుల జోక్యంతో గొడవ అక్కడికక్కడే సద్దుమణిగింది.


Next Story