- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసిన వీఆర్ఏలు
by Disha Web Desk 20 |
X
దిశ, కాసిపేట : మండలంలోని తాహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి, కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వీఆర్ఏలు మాట్లాడుతూ గత 77 రోజుల నుండి సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 56 మంది వీఆర్ఏలు చనిపోయారని తెలిపారు.
గత మూడు నెలల నుంచి జీతాలు రాక కుటుంబ పోషణ భారమై, గ్రామ రెవెన్యూ సహాయకులు, వారి కుటుంబాలు పండగ పూట పస్తులుగా ఉండే పరిస్థితి వచ్చిందన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను అమలు చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ కున్సోత్ శ్రీనివాస్, జిల్లా కో కన్వీనర్ బొడ్డు కార్తీక్, మండల అధ్యక్షులు దుర్గం రాజలింగు, దినేష్, రవి, స్వామీ, రహీమ్ పాల్గొన్నారు.
Next Story