మండుటెండలో కొనసాగుతున్న పాల్వాయి పాదయాత్ర..

by Disha Web Desk 20 |
మండుటెండలో కొనసాగుతున్న పాల్వాయి పాదయాత్ర..
X

దిశ, బెజ్జుర్ : మండుటెండలో సైతం పల్లెపల్లెకు పాల్వాయి గడపగడపకు బీజేపీ పాదయాత్ర అనే నినాదంతో బీజేపీ సిర్పూర్ నియోజకవర్గ నాయకులు పాల్వాయి హరీష్ బాబు చేపట్టిన పాదయాత్ర కార్యక్రమం సోమవారం బెజ్జూరు మండలంలో రెండో రోజు కొనసాగింది. మండలంలోని నాగపెళ్లి, మొగవెల్లి, గేర్రిగూడ, సోమినీ గ్రామాల్లో కొనసాగుతుంది.

మండుట సైతం లెక్కచేయకుండా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. గ్రామాల్లో సమస్యలు తెలుసుకుంటూ పర్యటిస్తున్నారు. ఆయా గ్రామాల్లో బీజేపీ జెండాలు ఎగరవేస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి రావాలని ప్రజలకు తెలుపుతున్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే మండలంలోని అన్ని సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఆయన వెంట మాజీ సర్పంచులు, బీజేపీ నాయకులు పాల్గొంటున్నారు.


Next Story