ఆత్రం సమ్మ‌క్క కుటుంబానికి ప్ర‌భుత్వం ఆదుకోవాలి

by Ratna Kumari |

ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదివాసి కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సోయం చిన్నయ్య డిమాండ్ చేశారు.

ఆత్రం సమ్మ‌క్క కుటుంబానికి ప్ర‌భుత్వం ఆదుకోవాలి
X

దిశ‌, బెజ్జూర్ : ఆత్రం సమ్మక్క కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదివాసి కోయ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు సోయం చిన్నయ్య డిమాండ్ చేశారు. మంగళవారం బెజ్జూరు మండల కేంద్రంలో ఆదివాసి సంఘం కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొండపల్లి గ్రామంలో సమ్మక్కను గొంతు నమిలి హత్యచేశారని.. సమ్మక్క కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ప్రభుత్వం రూ.25ల‌క్ష‌లు ఎక్స్ గ్రేషియా చెల్లించాల‌ని డిమాండ్ చేశారు. భ‌విష్య‌త్ లో కుల హ‌త్య‌లు, ఈ లోకంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేయాల‌ని పాస్ట‌ర్ కోర్టు ఏర్పాటు చేసి నిందితుడికి శిక్ష ప‌డే విధంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆదివాసి మండ‌ల అధ్య‌క్షుడు కోరుత తిరుప‌తి, మ‌హిళా అధ్య‌క్షురాలు అమృత‌, స‌ర్పంచ్ లు శ్రీహ‌రి, సాయి కృష్ణ నాయ‌కులు పాల్గొన్నారు.

Next Story