కారు బోల్తా.. ప‌లువురికి గాయాలు

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, బోథ్ : నేర‌డిగొండ మండ‌ల కేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో శుక్ర‌వారం ప్ర‌మాద‌వ‌శాత్తు కారు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురుకి

కారు బోల్తా.. ప‌లువురికి గాయాలు
X

దిశ‌, బోథ్ : నేర‌డిగొండ మండ‌ల కేంద్రంలోని పోలీస్ స్టేష‌న్ స‌మీపంలో శుక్ర‌వారం ప్ర‌మాద‌వ‌శాత్తు కారు బోల్తా ప‌డింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లువురికి గాయాల‌య్యాయి. స్థానికులు తెలిపిన స‌మాచారం ప్ర‌కారం.. అతివేగంతో వెళ్లిన‌టువంటి కారు అదుపుత‌ప్పి బోల్తా ప‌డిన‌ట్టు స‌మాచారం. కారు బోల్తా ప‌డినట్టు చూసిన స్థానిక ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకొని అంబులెన్స్ కి ఫోన్ చేశారు. అంబులెన్స్ వ‌చ్చే వ‌ర‌కు అక్క‌డే ఉండి గాయాల పాలైన ప‌లువురిని అంబులెన్స్ లో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. దీంతో ప‌లువురు ఎమ్మెల్యే అనిల్ జాద‌వ్ పై హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌మాదానికి కార‌ణం పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Next Story