చెరువులో పడి బాలుడు మృతి

by Disha Web Desk 1 |
చెరువులో పడి బాలుడు మృతి
X

దిశ, సారంగాపూర్: ఈత కోసం వెళ్లి చెరువులో మునిగి ఓ బాలుడు మృతిచెందిన ఘటన సారంగాపూర్ మండల కేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గణేష్ (14) అనే బాలుడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి చెరువులో ఈతకు వెళ్లారు. ఈత రాకపోవడంతో ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో గురువారం జాలరులతో చెరువుల గాలించగా మృతదేహం లభ్యమైంది. గణేష్ మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. ఘటనా స్థలాన్ని ఎస్సై పరిశీలించి మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణసాగర్ రెడ్డి తెలిపారు.

Next Story