బాసర ట్రిబుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత..

by Disha Web Desk 20 |
బాసర ట్రిబుల్ ఐటీ వద్ద మళ్ళీ ఉద్రిక్తత..
X

దిశ, భైంసా : ట్రీబుల్ ఐటీ ప్రధాన ద్వారం ముందు సోమవారం మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థుల వరుస ఆత్మహత్యల నిరసనగా బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతమూర్తి, పలువురు బీజేపీ మహిళల నాయకులు, కార్యకర్తలు ఇటివల జరిగిన విద్యార్థినిల ఆత్మహత్యల పట్ల ఆందోళనకు దిగారు.

త్రిబుల్ ఐటీకు వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకొనగా విద్యార్థులకు కాపలాగా ఉన్నారా..? అరెస్టుల కోసం ఉన్నారా...? అని పోలీసుల పై ఫైర్ అయ్యారు. త్రిబుల్ ఐటీని సందర్శించడానికి వచ్చిన బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతామూర్తితో పాటు ఇతర బీజేపీ మహిళా నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed