నార్లపూర్ హత్యకేసులో లొంగిపోయిన నిందితుడు..

by Disha Web Desk 20 |
నార్లపూర్ హత్యకేసులో లొంగిపోయిన నిందితుడు..
X

దిశ, మందమర్రి : ఎట్టకేలకు మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలో గతశనివారం రాత్రి నార్లాపూర్ లో జరిగిన హత్యకేసు నిందితుడు ముంజంపల్లి సురేష్ లొంగిపోయాడు. ఈ సందర్భంగా హత్య ఘటనకు సంబంధించిన వివరాలను సీఐ మహేందర్ రెడ్డి వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం మృతుడు ముంజంపల్లి పోశం ఏలియస్ బుజ్జి (50) గత పది సంవత్సరాలుగా నిందితుడు ముంజంపల్లి సురేష్ గృహంలో నివసిస్తున్నాడని తెలిపారు. మృతుడు పోశంకు భార్యా పిల్లలు లేకపోవడంతో తనసోదరుని కుమారుడు ముంజంపల్లి సురేష్ గృహంలో నివసిస్తున్నాడని చెప్పారు. ఈ క్రమంలో ముంజంపల్లి పోశంకు, కోడలుకు మద్యం మత్తులో ఇదివరకు చాలాసార్లు గొడవపడ్డాడని వివరించారు.

ఆ తర్వాత బంధుమిత్రుల సమక్షంలో మందలించామని తెలిపారు. కాగా శనివారం రాత్రికొడలుకు మామకు, దూషణ, గొడవ జరిగిందని పేర్కొన్నారు. ఈ విషయం ఇంటికి వచ్చిన ముంజంపల్లి సురేష్ కు భార్యచెప్పడంతో కోపోద్రికుడైన నిందితుడు సురేష్ కర్రతో కొట్టడంతో అక్కడికక్కడే పోషం మృతి చెందినట్లు చెప్పారు. మంగళవారం నార్లాపూర్ గ్రామస్తులతో ముంజంపల్లి సురేష్ వచ్చి మందమర్రి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు తెలిపారు. నిందితున్ని అరెస్టు చేసి న్యాయస్థానానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మందమర్రి ఎస్సై చంద్రకుమార్, జమేధర్ అజయ్, కానిస్టేబుల్ సంపత్, గోపాల్, హోమ్ గార్డ్ శ్రావణ్ ఉన్నారు.


Next Story