రేపటి నుంచి సోయా కొనుగోళ్లు ప్రారంభం

by Ratna Kumari |

దిశ ప్ర‌తినిధి, నిర్మ‌ల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సోయా కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి తెలిపారు. రైతులు

రేపటి నుంచి సోయా  కొనుగోళ్లు ప్రారంభం
X

దిశ ప్ర‌తినిధి, నిర్మ‌ల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డ్ లో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి సోయా కొనుగోలు ప్రారంభిస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి తెలిపారు. రైతులు పండించిన సోయా పంటను తొందరగా కొనుగోలు చేసేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇంచార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి డీసీసీ అధ్యక్షులు కూచాడి హరి రావు తీసుకువెళ్లారని తెలిపారు. వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సోయాబీన్ పంటకు ప్రభుత్వం క్వింటాలుకు రూ.5,328 చొప్పున మద్దతు ధరను ప్రకటించిందని అన్నారు.

Next Story