పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. ఐదుగురి పై కేసు నమోదు..

by Disha Web Desk 20 |
పేకాట స్థావరం పై పోలీసుల దాడి.. ఐదుగురి పై కేసు నమోదు..
X

దిశ, బెజ్జుర్ : కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం చింతకుంట శివారులో ఆదివారం పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకొని, కేసు నమోదు చేసినట్లు సిర్పూర్ టీ ఎస్సై డి కొండ రమేష్ తెలిపారు. వారి వద్ద నుండి రూ.68,080 నగదు స్వాధీనం చేసుకునట్లు సిర్పూర్(టి) ఎస్సై తెలిపారు. పేకాట ఆన్లైన్ మట్కా జూదం ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సిర్పూర్(టి) మండలంలో పేకాట, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్, ఆన్ లైన్ జూదం, మట్కా, లాంటివి ఆడి జీవితాలు పాడుచేసుకోవద్దు.

ఐపీఎల్ బెట్టింగ్ లు చేస్తూ, ఆన్ లైన్ మాట్కా, జూదం ఆన్ లైన్ గేమ్ లు ఆడుతున్న వారి పై చర్యలు తీసుకుంటాము, ఆడినవారు దొరికితే కేసులు నమోదు చేస్తామన్నారు. యువత ఇలాంటి ఆన్ లైన్ జూదం, క్రికెట్ బెట్టింగ్ లు ఆడుతూ అత్యాశకు పోయి జీవితాలు పాడు చేసుకోవద్దని ఆర్థికంగా నష్టపోతారన్నారు. కేసులు నమోదయ్యితే ఉద్యోగ అవకాశాలు, ఇతర అవకాశాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పేకాట, ఆన్ లైన్ మట్కా, జూదం, ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడే వారి సమాచారం ఇవ్వండని సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.



Next Story

Most Viewed