ఇసుక డంపుల స్వాధీనం… 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక సీజ్

by Kodari Anjali |

200 ట్రాక్టర్ ట్రిప్పుల అక్రమంగా తరలిస్తున్న ఇసుకను రెవెన్యూ సిబ్బంది సీజ్ చేశారు.

ఇసుక డంపుల స్వాధీనం… 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుక సీజ్
X

దిశ, ఏర్గట్ల : మండలంలోని దోంచంద గ్రామంలో బుధవారం రెవెన్యూ సిబ్బంది అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు వాగు వైపు వెళ్లగా, రోడ్డు పక్కన దాదాపు 200 ట్రాక్టర్ ట్రిప్పుల ఇసుకను అక్రమంగా నిల్వ ఉంచిన డంపును గుర్తించినట్లు తహసీల్దార్ మల్లయ్య తెలిపారు. గుర్తించిన ఇసుక డంపులను సీజ్ చేసి, పై అధికారులకు నివేదిక సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ఐ రవిదాస్ పాల్గొన్నారు.

Next Story