ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీకి అస్వస్థత.. మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-06-05 14:45:24  IST  )

యూ.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన పాలికి అప్పారావు ఉపాధి హామీ పనులకు వెళ్లి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. ..

ఉపాధి హామీ పనికి వెళ్లిన కూలీకి అస్వస్థత..  మృతి
X

దిశ, యూ.కొత్తపల్లి: యూ.కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామానికి చెందిన పాలికి అప్పారావు ఉపాధి హామీ పనులకు వెళ్లి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. అప్పారావు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయాడు. ఇది గమనించిన తోటి కార్మికులు వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తీసుకెళ్తున్న మార్గమధ్యంలోనే ఆయన మృతి చెందినట్లు సమాచారం. అప్పారావు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story