2.6 కేజీల గంజాయి పట్టివేత

by Ratna Kumari |

దిశ, వాంకిడి : అక్రమంగా గంజాయి సాగు చేసి విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసిన సంఘ‌ట‌న వాంకిడి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మ‌హేంద‌ర్

2.6 కేజీల గంజాయి పట్టివేత
X

దిశ, వాంకిడి : అక్రమంగా గంజాయి సాగు చేసి విక్రయిస్తున్న ముగ్గురిపై కేసు నమోదు చేసిన సంఘ‌ట‌న వాంకిడి పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. ఎస్సై మ‌హేంద‌ర్ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..వాంకిడి మండలంలోని జైత్పూర్ గ్రామానికి చెందిన బోర్కుటే సుభాష్.గుర్నులే సురేష్. ఆత్రం భీము లు అక్రమంగా గంజాయి సాగు చేస్తూ.. విక్రయిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 16 గంజాయి మొక్క‌లతో పాటు 2.6 కేజీల ఎండు గంజాయి ల‌భ్యం అయింది. దీని విలువ సుమారు 2.25 ల‌క్ష‌లు ఉంటుంద‌ని తెలిపారు. గంజాయి స్వాధీనం చేసుకొని ముగ్గురి పై కేసు న‌మోదు చేసిన‌ట్టు ఎస్సై వెల్ల‌డించారు.

Next Story