ఆ పని చేయడం లేదని దళితులపై సర్పంచ్ దాడి

by Dishanational2 |
ఆ పని చేయడం లేదని దళితులపై సర్పంచ్ దాడి
X

దిశ ,మంచిర్యాల: జైపూర్ మండలం బెజ్జాల గ్రామానికి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన వేముల శేఖర్, వేముల సుమన్ అన్నదమ్ముల పై గ్రామ సర్పంచ్ జైపాల్ గౌడ్, కులాన్ని దూషిస్తూ తమపై తాటి మట్టల‌తో దాడి చేశారని బాధితులు తెలిపారు. శుక్రవారం రోడ్డుపై వెళ్తున్న అన్నదమ్ములపై సర్పంచ్ జైపాల్ గౌడ్ కుట్రపూరితంగా వ్యవహరించి దాడికి దిగారని, వార్డ్ మెంబర్, గ్రామస్తులు ఆపినా ఆగకుండా తమపై పాశవికంగా దాడి చేశారంటూ బాధితులు వాపోయారు. గతంలో సర్పంచ్ ఎన్నికల సమయంలో సర్పంచ్ జైపాల్ గౌడ్‌తో పాటు పని చేసినా, ప్రస్తుత సమయంలో తమకు సహకరించడం లేదని మండల,గ్రామం, ఇతర సభ్యులు పిలిచినా రాకపోవడంతో తమపై దాడికి దిగారని తెలిపారు.



Next Story

Most Viewed