విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి

by Disha Web Desk 15 |
విద్యుదాఘాతంతో పారిశుధ్య కార్మికుడు మృతి
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో పంచాయతీ కాంట్రాక్టు కార్మికుడు విద్యుత్ షాక్ కు గురై స్తంభం పై నుంచి పడి మృతి చెందిన సంఘటన శనివారం జరిగింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బుధకుర్దు గ్రామానికి చెందిన రాచకొండ ప్రశాంత్ (23) అదే గ్రామంలో విద్యుత్ దీపాలు అమర్చేందుకు కరెంటు స్తంభం ఎక్కి పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి స్తంభం పై నుంచి పడి తలకు తీవ్రంగా గాయమై మృతి చెందాడు.

పారిశుద్ధ కార్మికుడితో విద్యుత్ పనులు చేయించడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని మృతుని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్తంభం వద్ద లైన్ మెన్ ఉండి ప్రశాంత్ తో విద్యుత్ పనులు చేయించాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రశాంత్ మృతికి అధికారులు బాధ్యత వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ మృతితో బుధకుర్డులో విషాదం అలునుముకుంది. ఘటన స్థలాన్ని తాళ్ల గురజాల ఎస్ఐ నరేష్ పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Next Story