Free Electricity : రేవంత్ రెడ్డి ఓర్వలేకనే వివాదస్పద వ్యాఖ్యలు : Durgam Chinnaiah Mla

by Disha Web Desk 15 |
Free Electricity : రేవంత్ రెడ్డి ఓర్వలేకనే  వివాదస్పద వ్యాఖ్యలు : Durgam Chinnaiah Mla
X

దిశ,కాసిపేట : కాసిపేట మండలంలోని కొండాపూర్ యాపలో బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తుంటే రేవంత్ రెడ్డి ఓర్వలేక రైతులకు 3 గంటల కరెంట్ ఇవ్వాలనడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేస్తే రైతులకు 3 గంటలే కరెంట్ ఇస్తారని, రైతు బంధు,ధరణి తీసేసి రైతులను ఇబ్బందిపాలు చేస్తారన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు ఇవ్వకుండా వేధిస్తారన్నారు.

కార్యక్రమంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, జెడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ పుస్కురి విక్రం రావు, బారాసా మండల అధ్యక్షుడు బొల్లు రమణా రెడ్డి, ఎంపీటీసీలు చంద్రమౌళి, అక్కేపెల్లి లక్ష్మి, కొండబత్తుల రాంజేందర్, జిల్లా సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సపాట్ శంకర్, సర్పంచ్​ మక్కల శ్రీనివాస్, ముత్యాల స్వప్న, దేవీ కొండయ్య, జంగు మార్కెట్ కమిటీ మెంబర్ మంజుల రెడ్డి, బీఆర్​ఎస్ కార్యదర్శి మోటూరి వేణు, ఉప సర్పంచ్ లు సుమన్ గౌడ్, శ్యామ్, సుమన్, బోయిని తిరుపతి, రైతు సమితి అధ్యక్షులు దుర్గం పోశం తదితరులు పాల్గొన్నారు.

Read More : రైతు వ్యతిరేక కాంగ్రెస్ పార్టీని ప్రజలు తరిమికొట్టాలి : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి

Next Story

Most Viewed