నిందితుని ఇంటి ముందే దంపతుల మృతదేహాలను దహనం చేస్తాం..

by Disha Web Desk 20 |
నిందితుని ఇంటి ముందే దంపతుల మృతదేహాలను దహనం చేస్తాం..
X

దిశ, జన్నారం : మండలంలోని చింతలపల్లె గ్రామంలో మంగళవారం రాత్రి హత్యకు గురైన జింక లచ్చన్న, రాజేశ్వరి దంపతుల మృతదేహాలను బంధువులు బుధవారం మధ్యాహ్నం నిందితుని ఇంటి ముందు తీసుకెళ్లి ఆందోళన చేపట్టారు. మంగళవారం హత్యకు గురైన దంపతులకు లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో శవ పరిక్షలు నిర్వహించారు. ఆనంతరం పోలీసులు దంపతులను మృత దేహాలను బుధవారం బంధువులకు అప్పజెప్పారు. దాంతో వారు నేరుగా చింతలపల్లె గ్రామంలోని నిందితుని ఇంటి ముందుకు మృతదేహాలను తరలించి అక్కడే దహన సంస్కారాలు చేసేందుకు సిద్దమైయ్యారు.

ఈ విషయం తెలియగానే లక్సెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్ ఆధ్వర్యంలో పోలీసులు వెళ్లి మృతుల బందువులను వారించారు. కొద్దిసేపు పోలీసులతో వాగ్వీవాదానికి దిగారు. సుమారు రెండు గంటలపాటు గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. చివరకు సీఐ కరీముల్లాఖాన్, గ్రామపెద్దలు మృతుల బందువులకు నచ్చజెప్పి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హమీ ఇవ్వడంతో శాంతించి మృతదేహాలను అక్కడి నుండి తీసుకెళ్లి దహనసంస్కారాలు నిర్వహించారు.

Next Story

Most Viewed