పీక్స్‌కు చేరిన పిచ్చి.. పోలీస్ వాహనంలో యువకుల రీల్స్

by Batti.Sumithra |   (  Updated:2025-11-19 06:36:44  IST  )

సోషల్ మీడియాలో యువకుల రీల్స్ పిచ్చి రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు.

పీక్స్‌కు చేరిన పిచ్చి.. పోలీస్ వాహనంలో యువకుల రీల్స్
X

దిశ, ఆదిలాబాద్ : సోషల్ మీడియాలో యువకుల రీల్స్ పిచ్చి రోజురోజుకు మరింత పెరిగిపోతుంది. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది చట్ట వ్యతిరేక పనులు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాజాగా ఆదిలాబాద్ పోలీస్ శాఖకు చెందిన ఓ ఇన్నోవా వాహనాన్ని ఉపయోగించి ఇద్దరు యువకులు రీల్స్ చేసి, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా అధికారిక వాహనంలో రీల్స్ చేయడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

ఈ రీల్ వైరల్ కావడంతో ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చట్టవిరుద్ధంగా అధికార వాహనంతో రీల్స్ చేసిన యువకుల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సునీల్ కుమార్ తెలిపారు. కాగా ఈ పోలీస్ వాహనం ఎవరిచ్చారనేది.. పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఈ ఇద్దరు యువకుల రీల్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పోలీసు వాహనంతో రీల్స్ చేయడం ఏంటని పలువురు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

Next Story