పేకాట స్థావ‌రం పై పోలీసుల దాడి

by Ratna Kumari |

మండ‌ల ప‌రిధిలోని ఇందిరా న‌గ‌ర్ లో పేకాట ఆడుతున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఎస్సై వెంక‌ట కృష్ణ ఆధ్వ‌ర్యంలో దాడి చేశారు.

పేకాట స్థావ‌రం పై పోలీసుల దాడి
X

దిశ‌, రెబ్బెన : మండ‌ల ప‌రిధిలోని ఇందిరా న‌గ‌ర్ లో పేకాట ఆడుతున్నార‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఎస్సై వెంక‌ట కృష్ణ ఆధ్వ‌ర్యంలో దాడి చేశారు. ఎస్సై తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. పేకాట ఆడుతున్న‌టువంటి కొలి వెంక‌టేష్, గ‌డ్డం ల‌క్ష్మ‌ణ్, గోర్ల ర‌వీంద‌ర్ లు ప‌ట్టు ప‌డ్డారు. మ‌రో ఆరుగురు నిందితులు ప‌రార‌య్యారు. నిందితుల వ‌ద్ద నుంచి రూ.12,040 న‌గ‌దును స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ప‌రారీలో ఉన్న బానోత్ వ‌సంత‌రావు, అజ్మీర విన‌య్ తో పాటు మ‌రో న‌లుగురి కోసం గాలిస్తున్న‌ట్టు ఎస్సై తెలిపారు.

Next Story