పీడీఎస్ బియ్యం పట్టివేత..

by Disha Web Desk 20 |
పీడీఎస్ బియ్యం పట్టివేత..
X

దిశ, కుబీర్ : కుబీర్ మండలంలోని పార్టీ బి గ్రామశివారులో ఆదివారం అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని స్థానిక ఎస్సై ఎండీ షరీఫ్ పట్టుకున్నారు. బొలెరో పికప్ వాహనంలో మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు పక్కా సమాచారం రావడంతో పదిక్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి నిల్వ ఉంచిన అక్రమంగా మహారాష్ట్రకు తరలించి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. అక్రమంగా తరలిస్తున్న వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలి అన్నారు. పట్టుబడిన బియ్యాన్ని రెవెన్యూ సిబ్బందికి అప్పగించినట్లు ఎస్సై ఎండీ.షరీఫ్ తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story