- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం.. ప్రయాణికులకు శాపం..
దిశ, బెజ్జూర్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల సిర్పూర్ నియోజకవర్గంలోని పలుమండలాల ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఆదివారం రోజున పెంచికలపేట బెజ్జూర్ రూట్ లో ఉదయం 7:40 తర్వాత 10:30 గంటల వరకు ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో కాగజ్ నగర్ బస్టాండ్ లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేసిన సమయపాలన పట్టిక ప్రకారం, కాగజ్నగర్ నుండి బెజ్జూరు, పెంచికలపేట రూట్ లో ఉదయం 7.45 తర్వాత 8:20, 9:30, 10:30 బస్సులు నడపాలి.
అధికారులు మాత్రం సమయపాలన పట్టికను పాటించుకోకుండా ఇష్టానుసారంగా బస్సులు నడుపుతూ, ప్రైవేటు వాహనాలు కూడా నడవలేని, మారుమూల గ్రామాల ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసం అని ప్రయాణికులు ఆర్టీసీ అధికారుల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూడు బస్సులు క్యాన్సల్ చేయడంతో గంటల తరబడి బస్టాండ్ లో బస్సుల కోసం వేచి చూస్తున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇలాంటి సమస్య పునరావృత్తం కాకుండా చూడాలని తగుచర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఈ విషయమై డీఎం సంప్రదించగా పరీక్షల కారణంగా కొన్ని రూట్లలో బస్సులు నడపలేక పోయామని తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు.