జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

by Nallavelli.Anjaneyulu |

దిశ, మంచిర్యాల : జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా

జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
X

దిశ, మంచిర్యాల : జిల్లాలో జాతీయ రహదారి విస్తరణ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో జాతీయ రహదారి విస్తరణ పనుల పై ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ప్రభావిత గ్రామాలలో అవార్డుల జారీ ప్రక్రియ వేగవంతం చేసి, ఆర్బిట్రేషన్ సంబంధిత రికార్డులను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు బాధ్యత చేపట్టాలన్నారు. సర్వే పనుల్లో అధికారులు నిర్లక్ష్యం వీడి పనులను వేగవంతం చేసే దిశగా కృషి చేయాలన్నారు.

Next Story