కంటి వెలుగు కార్యక్రమన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాల్క సుమన్..

by Disha Web Desk 20 |
కంటి వెలుగు కార్యక్రమన్ని పరిశీలించిన ఎమ్మెల్యే బాల్క సుమన్..
X

దిశ, రామకృష్ణాపూర్ : రాష్ట్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమమని చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని 20 వార్డులో కొనసాగుతున్న కంటి వెలుగు కార్యక్రమన్ని గురువారం ఎమ్మెల్యే సుమన్ పరిశీలించి వైద్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమన్ని స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోవలని సూచించారు.

అంధత్వ నివారణకు అందరూ సహకరించాలన్నారు. పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేస్తామన్నారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, ఇంచార్జ్ గాండ్ల సమ్మయ్య, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ అనిల్ రావు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed