నిరుపయోగంగా మారిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్.. వాస్తు దోషమే కారణమా..

by Disha Web Desk 20 |
నిరుపయోగంగా మారిన ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్.. వాస్తు దోషమే కారణమా..
X

దిశ, మంచిర్యాల టౌన్ : మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే దివాకర్ రావు, క్యాంప్ఆఫీస్ కు నిత్యం రాకపోవడంతో క్యాంప్ఆఫీస్ కాస్త బోసిపోయి కనిపిస్తుంది. క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంలో ఎటువంటి బోర్డు గాని, క్యాంప్ఆఫీస్ అని తెలియజేసే సూచికలు కూడా లేకపోవడం విడ్డూరం. ఆఫీస్ కి వాస్తు దోషం ఉందని వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా గెలవాలంటే సొంత ఇంట్లోనే ఉండడం మంచిదనే విషయాన్ని పలువురు ఎమ్మెల్యే దివాకర్ రావుకు చెప్పడంతో అప్పటి నుంచి ఆయన కార్యకలాపాలన్నీ సొంత ఇంటి నుంచే కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యేలు నిత్యం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో ఉండేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ. కోటి చొప్పున వెచ్చించి ప్రతినియోజక వర్గానికి ఒక ఏమ్మెల్యే క్యాంప్ఆఫీస్ ను నిర్మించింది. అందులోనే ఎమ్మెల్యేలు ఉంటే నియోజక వర్గ ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి నేరుగా ఎమ్మెల్యేను కలిసి విన్నవించుకునే అవకాశంతో పాటు ఎమ్మెల్యేకు సైతం అధికారులను క్యాంప్ ఆఫీస్ కి పిలిపించుకొని సమస్యలకు సంబంధించిన సమావేశలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంది.

కానీ మంచిర్యాల నియోజక వర్గ ప్రజలు, అధికారులు, పనికోసం వచ్చే వాళ్లకు ఎమ్మెల్యే సొంత ఇల్లే ఆఫీస్ గా మారింది. అనుకున్న సమయం కన్నా ముందే క్యాంప్ఆఫీస్ నిర్మాణం పూర్తి అయినప్పటికీ పలురాజకీయ విమర్శల మధ్య ఆలస్యంగా గృహ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుండి ఇప్పటి వరకు క్యాంప్ ఆఫీస్ కు ఎపుడో ఒకసారి ఆలావెళ్లి ఇలా వస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి. పోయిన ఏడాది జులై నెలలో కురిసిన అకాల వర్షాలకు ఎమ్మెల్యే ఉండే సొంత ఇంటి ప్రాంతం అంతా వరదలు వచ్చి నీళ్లు చేరడంతో ఆ రెండుమూడు రోజులు మాత్రమే కుటుంబ సభ్యులతో క్యాంప్ ఆఫీస్ లో తలదాచుకుని వరద నీళ్లు తగ్గగానే మకాం మళ్లీ సొంత ఇంటికి మార్చారు. ఇప్పటికయినా ఎమ్మెల్యే ప్రభుత్వం నిర్మించిన క్యాంప్ఆఫీస్ ను వినియోగించుకోవాలని, దానివల్ల నియోజక వర్గ ప్రజలకు, అధికారులకు మేలు జరుగుతుందని పలువురు ఆకాంక్షిస్తున్నారు.


Next Story

Most Viewed