రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

by Bhanu |   (  Updated:2025-05-04 12:39:36  IST  )

ఆర్మూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన ఇద్దరు అక్క చెల్లిలు మృతి చెందారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థుల కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
X

దిశ, పెంబి: ఆర్మూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో పెంబి మండలంలోని లోతర్య తండాకు చెందిన ఇద్దరు అక్క చెల్లిలు మృతి చెందారు. వారి కుటుంబానికి ఆదివారం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం అందజేశారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని ఒక్కరికి ఐ టీ డి ఏ తరపున ప్రభుత్వ ఉద్యోగం వచ్చేవిదంగా చేస్తామని భరోసా కల్పించారు. ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రేఖ నాయక్, స్వప్నిల్ రెడ్డి శంకర్, రాజురా సత్యం ఉన్నారు.




Next Story