- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ముచ్చటగా మూడోసారి కూడా సీఎం కేసీఆరే.. : ఎమ్మెల్యే నడిపెళ్ళి దివాకర్ రావు
దిశ, మంచిర్యాల టౌన్: తెలంగాణకు ముచ్చటగా మూడోసారి కూడా సీఎం కేసీఆరేనని మంచిర్యాల ఎమ్మేల్యే దివాకర్ రావు అన్నారు. పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో మంగళవారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు పెద్ధపెల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత ముఖ్య అతిథిగా హాజరై పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మంచిర్యాల ఎమ్మేల్యే దివాకర్ రావు మాట్లాడుతూ.. దయగల సీఎం కేసీఅర్ అంటూ ఆయన వల్లే నేడు రైతులు, పేద ప్రజల అభ్యున్నతి కొనసాగుతోందన్నారు. ]
ఒక్క రైతు కూడా నష్ట పోకుండా గిట్టుబాటు ధరతో వడ్లు కొనుగోలు చేసి రైతును రాజు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. మహిళలకు రుణాలు, పేదింటి ఆడపిల్లల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలతో ప్రజల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముకేష్ గౌడ, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.