కాక‌తీయ విద్యార్థుల అయోమ‌యం..!

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, ఉట్నూర్ : కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో డిగ్రీ మొద‌టి, మూడో, ఐదోవ సెమిస్ట‌ర్ ప‌రీక్ష తేదీల‌ను యూనివ‌ర్సిటీ అధికారులు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. అయితే ఈనెల 18వ తేదీ నుంచి డిగ్రీ

కాక‌తీయ విద్యార్థుల అయోమ‌యం..!
X

దిశ‌, ఉట్నూర్ : కాక‌తీయ యూనివ‌ర్సిటీ ప‌రిధిలో డిగ్రీ మొద‌టి, మూడో, ఐదోవ సెమిస్ట‌ర్ ప‌రీక్ష తేదీల‌ను యూనివ‌ర్సిటీ అధికారులు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. అయితే ఈనెల 18వ తేదీ నుంచి డిగ్రీ ప‌రీక్ష‌ల‌ను విద్యార్థుల‌ను రాయ‌నున్నారు. అయితే పిష్త్ సెమిస్టర్ పరీక్షలైన పొలిటికల్ సైన్స్ గ్రూప్ (ఓల్డ్) పరీక్ష తేదీని ఏకంగా 15.12. 2028 తేదీగా ప్రకటించారు. దీంతో ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు ఆయోమయానికి గురవుతున్నారు. పరీక్ష రాయాలంటే మూడు సంవత్సరాల ఆగాల్సిందేనా..? అంటూ వాట్సాప్ గ్రూప్ లలో పోస్టులు పెడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని పలువురు విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story