జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలి : TWJF

by Nallavelli.Anjaneyulu |

దిశ, మందమర్రి : మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడతలో ప్రాధాన్యత ఇవ్వాల

జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్ళు కేటాయించాలి : TWJF
X

దిశ, మందమర్రి : మంచిర్యాల జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇండ్ల రెండవ విడతలో ప్రాధాన్యత ఇవ్వాలని, మందమర్రి సోమగూడెంకు మధ్యలో ఉన్న టోల్ ప్లాజాలో స్థానిక విలేకరులకు రాకపోకలలో మినహాయింపు ఇవ్వాలని, అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (TWJF) ఆధ్వర్యంలో ఐ డి ఓ సి లో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మిట్టపల్లి మధు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు శ్రీనాథ్, సతీష్, ఈసీ మెంబర్లు మడ్డి వేణుగోపాల్ గౌడ్, సందీప్, వీరస్వామి, సురేష్ , సురేందర్, నరేష్, భాస్కర్, కిరణ్, రవీందర్ పాల్గొన్నారు.

Next Story