తన ఓటు తనకే దక్కని వైనం.. గడ్డం వినోద్ దైన్యం..

by Disha Web Desk 20 |
తన ఓటు తనకే దక్కని వైనం.. గడ్డం వినోద్ దైన్యం..
X

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ తన ఓటు తానే వేసుకోలేని పరిస్థితి ఎన్నికల సందర్భంగా జోరుగా చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వినోద్ బెల్లంపల్లి నివాసి కాదు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి కావడం గమనార్హం.

గడ్డం వినోద్ స్థానికేతరుడు కావడంతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ తన ఓటుకు తానే దూరమయ్యాడనే అంశం ప్రజల్లో ఆసక్తికర చర్చగా మారింది. మిగతా అభ్యర్థులు తన ఓటును ఆయా పోలింగ్ కేంద్రాల్లో వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ గెలుపు దిశలో ఉన్నారు.


Next Story